భారతదేశం, జూలై 5 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడుతూనే.. మరోవైపు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 51 పట్టణ స్థానిక సంస్థలలో(ULBs) 'స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్' (వీధి వ్యాపార ప్రణాళికలు) అమలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా వీధి వ్యాపారుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభించడంతో పాటు.. నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల భద్రత మెరుగుపడనున్నాయి.

'వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం-2014' ప్రకారం.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పరిధిలోకి మూడు నగరపాలక సంస్థలు (కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం), 48 మున్సిపాలిటీలు వస్తాయి. ఇందులో భీమవరం, హిందూపూర్, గుం...