భారతదేశం, ఆగస్టు 3 -- ఆంధ్రప్రదేశ్‌లో అవయవ మార్పిడి చికిత్సలను పేదలకు ఉచితంగా, మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా 12 ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో 'జీవన్‌దాన్' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అవయవ దాన దినోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద రోగులు ఖరీదైన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బోధనాసుపత్రుల్లోనే అధునాతన అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అవయవ దానాన్ని ప్రోత్సహించడంతో పాట...