భారతదేశం, ఏప్రిల్ 2 -- వాతావరణ సూచన ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా లేదా సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భిన్నమైన ధోరణి కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగవచ్చు, అదే సమయంలో రాత్రులు కూడా వెచ్చగా ఉండి అసౌకర్యంగా ఉండవచ్చు.

తీరప్రాంత జిల్లాల్లో వడగాలుల రోజుల సంఖ్య.. సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్‌పై ఒత్తిడిని పెంచవ...