భారతదేశం, జూన్ 29 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో ప్రభుత్వం తాత్కాలిక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఎన్నికల సంబంధిత విధుల నిర్వహణలో అంగన్‌వాడీ టీచర్లు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనివల్ల అటు కేంద్రాల నిర్వహణ, ఇటు బీఎల్‌ఓ విధుల సమన్వయం కష్టతరంగా అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, పరిష్కరించడానికి ప్రభుత్వం తాత్కాలికంగా నెల రోజుల పాటు సమయాలను సవరించినట్టుగా ప్రకటించింది.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. బీఎల్‌ఓ విధుల్లో ఉన్న అంగన్‌వాడీ ...