భారతదేశం, జూలై 10 -- ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(AEE) నియామకాలు పలుకుబడికి లేదా అవకతవకలకు తావులేకుండా, కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతాయని APTRANSCO పునరుద్ఘాటించింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ హెచ్ఆర్‌డీ) సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అలాగే గేట్, యూజీసీ-నెట్ వంటి జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేశారు.

పరీక్ష వాయిదా, సిలబస్ మార్పులు లేదా ఉద్యోగాల అమ్మకం వంటి వదంతులను ఆయన తోసిపుచ్చారు. 2026 ఆగస్టు 22 నుండి 29 వరకు షెడ్యూల్ ప్రకారం సీబీటీ జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. 23,000కు పైగా దరఖాస్తులు అందినట్లు ప్రవీణ్ చంద్ వెల్లడించారు. అభ్యర్థులను బ్రోకర్లు, జాబ్ అప్పిస్తామని చెప్పేవారిపట్ల జాగ్రత్తగా ఉం...