భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC)ను భారీ స్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీ ఆధునీకరణలో భాగంగా రాబోయే రెండు నెలల్లోనే మొదటి విడత కింద 700 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పీఎం ఇ-బస్ సేవ' (PM e-Bus Sewa) పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. ఇవి కాకుండా అదనంగా మరో 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది.

ఈ బ్యాటరీ బ...