భారతదేశం, జూలై 10 -- ఏకాదశి తిథికి సనాతన ధర్మంలో విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించడం వల్ల వేల గోదానాలతో సమానమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ వ్రత నియమాలను సరిగ్గా పాటించినప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది.

ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత, చేతిలో నీరు తీసుకుని శ్రీహరిని స్మరిస్తూ వ్రత సంకల్పం చేయాలి. "స్వామీ, ఈ రోజు నేను నీ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తున్నాను, నాపై అనుగ్రహం చూపు," అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. పగలు విష్ణుమూర్తి ధ్యానంలో గడపాలి. రాత్రిపూట జాగరణ చేయడం ఉత్తమం. శక్తి కొద్దీ పేదలకు దానధర్మాలు చేసి, తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించమని భగవంతుడిని వేడుకోవాలి. శుక్ల పక్షం, కృష్ణ పక్షం అనే తేడా లేకుండా ప్రతి ...