భారతదేశం, సెప్టెంబర్ 10 -- కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్(AE) నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాదిక్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సాదిక్‌కు విషపూరితమైన ద్రావణాలను విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్‌లను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు విచారించారు.

పోలీసుల విచారణలో అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్ సంచలన వివరాలు వెల్లడించారు. సాదిక్ ఖాన్ తమ వద్దకు వచ్చి అత్యంత విషపూరితమైన లిక్విడ్ కావాలని కోరినట్లు తెలిపారు. మొదట అతడికి థాయ్ పొటాషియం ఇచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. ఇది ఎందుకు అని...