భారతదేశం, మార్చి 31 -- పోలీసు వ్యవస్థ రోజురోజుకు కొత్త టెక్నాలజీతో అప్‌డేట్ అవుతోంది. ఏఐని కూడా పోలీసులు కేసులో విచారణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. నేరస్థుల పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు అప్‌డేట్ అవుతున్నారు. అందులో భాగంగా పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించి.. పాత నేరస్థులు, దొంగలను పట్టుకుంటున్నారు. ఇందుకోసం పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ద్వారా నేరస్థులను ఈజీగా గుర్తించవచ్చు. దీనిని పోలీసులు అధికారులు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఒక్కసారి థంబ్ పెడితే.. పాత నేరస్థులు, దొంగల పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఏపీలో పోలీసులు ఈ స్కానర్‌ను వాడుతున్నారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడంలోనూ ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.

పాపిల్లాన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో నేర...