భారతదేశం, జూలై 12 -- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) పర్యవేక్షణలో అందించే సిఫారసులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, డిజైన్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి బ్యారేజీల్లో నీటిని నిలువచేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకే నీటిని ఎత్తిపోయడం లేదని చెప్పారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... కాళేశ్వరం ప్రాజెక్టు - మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వచేసి ఎత్తిపోయడానికి వీలులేని పరిస్థితులు, ఎన్ డీఎస్ఏ నివేదిక అంశాలను సమగ్రంగా వివరించారు.

"కాళేశ్వరం బ్యారేజ...