భారతదేశం, సెప్టెంబర్ 15 -- స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. ఈసారి పెట్టుబడిదారుల ముందుకు రెండు విభిన్న రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రాబోతున్నాయి. ఒకవైపు మార్కెట్ మౌలిక వసతుల రంగానికి తిరుగులేని రాజు లాంటి ఎన్‌ఎస్‌ఈ (NSE), మరోవైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగానికి అను అనుబంధంగా పనిచేసే హీరో మోటార్స్ (Hero Motors) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమయ్యాయి.

ఈ రెండు ఐపీఓలు వరుస రోజుల్లో ప్రారంభమవుతుండటంతో, రెండింటిలో ఏది ఎక్కువ లిస్టింగ్ లాభాలు అందిస్తుంది, దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే చర్చ ఇన్వెస్టర్లలో మొదలైంది. హీరో మోటార్స్ ఐపీఓ సెప్టెంబర్ 16న ప్రారంభం కానుండగా, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచుకోనుంది. ఈ రెండు ఇష్యూల పూర్తి వివరాలు, జీఎంపీ ట్రె...