భారతదేశం, జూలై 22 -- జొమాటో మాతృ సంస్థ 'ఎటర్నల్' (Eternal) బుధవారం (జూలై 22) తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ (Q1FY27) త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం Rs.92 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన Rs.25 కోట్లతో పోలిస్తే ఇది 268 శాతం అధికం.

కంపెనీ ఏకీకృత కార్యకలాపాల రాబడి ఏడాది ప్రాతిపదికన (YoY) 182 శాతం పెరిగి Rs.20,211 కోట్లకు చేరింది. గతేడాది తొలి త్రైమాసికంలో (Q1FY26) రాబడి Rs.7,167 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.

అయితే, క్రితం త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే నికర లాభం 47.1 శాతం క్షీణించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో (Q4FY26) కంపెనీ Rs.174 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ప్రస్తుతం అది Rs.92 కోట్లకు పరిమితమైంది. రాబడి మాత్రం క్రితం త్రైమాసికంలోని Rs.17,292 కోట్లతో పోలిస్తే 16...