భారతదేశం, ఏప్రిల్ 30 -- దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమవ్వగా, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టి బీజేపీ జెండా పాతనుందని మెజారిటీ సర్వేలు అంచనా వేయగా, కేరళలో ఎల్‌డీఎఫ్ వరుస విజయాలకు బ్రేక్ పడనుందని విశ్లేషణలు వెలువడ్డాయి.

దేశం మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర అంచనాలను ఇచ్చాయి. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148ని దాటి, అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అత్యధిక సంస్థలు ప్రకటించాయి. అయితే, 'పీపుల్స్ పల్స్' వంటి కొన్ని సంస్థలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ (TMC) హ్యాట్రిక్ కొడుతుందని విశ్లేషి...