ఉమర్ ఖలీద్కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు.. కారణాలు ఇవే
భారతదేశం, మే 20 -- ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉమర్ ఖలీద్కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని కర్కర్ డూమా కోర్టు కొట్టేసింది. అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్పాయ్ ఈ మేరకు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమర్ ఖలీద్ తరఫు న్యాయవాది సాహిల్ ఘాయ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. రెండు ప్రధాన కారణాల వల్ల తన క్లయింట్కు 15 రోజుల మధ్యంతర బెయిల్ కావాలని కోరారు. మరణించిన తన మామ గారి 40వ రోజు వేడుక (చెహ్లమ్)కు హాజరవ్వాలని, శస్త్రచికిత్స చేయించుకోబోతున్న తన తల్లికి తోడుగా ఉంటానని అభ్యర్థించారు.
అయితే, ఈ విన్నపాన్ని ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిరుద్ధ్ మిశ్రా తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుడు కోర్టు ఉదారతను దుర్వినియోగం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.