భారతదేశం, ఏప్రిల్ 3 -- హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు 19వ టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల జరగనున్నాయి. దీనికోసం అధికారులు విస్తృతమైన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. సుమారు 39,000 మంది కూర్చునే సామర్థ్యం గల ఈ స్టేడియంలో పగలు, రాత్రి మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌ల సెక్యూరిటీ, సజావుగా నిర్వహణ కోసం సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా 750 మంది అధికారులు, 300 మంది ట్రాఫిక్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు/సాయుధ రిజర్వ్‌కు చెందిన 10 ప్లాటూన్లు, అశ్విక దళ పోలీసు విభాగాలు, బాంబు నిర్వీర్య బృందాలు, నిఘా బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు.

స్టేడియంలో ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేశారు. స్టేడియం, పార్కింగ్ జోన్లు, కనెక్టివిటీ...