భారతదేశం, జూన్ 26 -- Telangana Govt Employees Insurance : ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు గాను.. రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న 16 ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అధికారికంగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.

సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంటేనే ఒక నమ్మకమన్నారు. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత అనే భావనను తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్...