భారతదేశం, ఆగస్టు 1 -- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతికి ఊతమిచ్చే రూ.18,000 కోట్ల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సింహాచలం అప్పన్న స్వామికి, విజయనగరం పైడితల్లి అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించారు.

ఏపీ ప్రగతిలో ఒక శుభదినమని, రూ.18,000 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను వేగంగా మారుస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం విమానాల రాక...