భారతదేశం, జూలై 23 -- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1) ఫలితాల్లో దుమ్మురేపింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి గురువారం నాడు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్ నికర లాభం (PAT) గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 206.7 శాతం భారీ వృద్ధితో రూ. 317 కోట్లకు చేరింది.

ఈ ఆకట్టుకునే ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 4 శాతం వరకు నష్టపోయిన ఉజ్జీవన్ బ్యాంక్ షేరు ధర, ఆర్థిక ఫలితాల ప్రకటన వెలువడగానే వేగంగా కోలుకుంది. 1.63 శాతం లాభపడి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ. 66.10 వద్దకు చేరింది.

ఈ త్రైమాసికంలో బ్యాంక్ తన చరిత్రలోనే అత్యధిక నికర వడ్డీ ఆదాయాన్ని (NII) నమోదు చేసింది. గతేడాయితో పోలిస్తే NII 38.6 శాతం పెరిగి రూ. 1,186 కోట్లకు చేరి...