భారతదేశం, మార్చి 25 -- ఉగ్రవాద సంబంధాలున్నాయనే అనుమానంతో పలు రాష్ట్రాల్లో సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో 12 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితులను అరెస్టు చేసేందుకు బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రత్యేక బృందాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

'బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్‌లలో పలు బృందాలను ఏర్పాటు చేసి మోహరించాం. దీని ఫలితంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న 12 మంది అనుమానితులను అరెస్టు చేశాం. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉన్నారు.' అని ఒక ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్‌గా గుర్తించారు. వీరంతా విజయవాడ నగరవాసులు. పోలీసుల ప్ర...