భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరి 15 రోజుల్లో గ్రహాల కదలికల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన స్థాయిలో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రెండు వారాల వ్యవధిలో కొన్ని రాశుల వారు వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చిన్నచిన్న విషయాలకే కోపానికి గురికావడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రశాంతంగా, యోచించి అడుగులు వేయడం మంచిది. ఈ కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఆ 5 రాశుల వివరాలు ఇవే..

ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ, పిల్లల వ్యవహారాల్లో చాలా ఓపికగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఉన్న వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఈ సమయంలో శత్రువుల నుంచి వ్...