భారతదేశం, ఏప్రిల్ 9 -- హైదరాబాద్, రంగారెడ్డి , మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 36.. 2BHK హౌసింగ్ కాలనీలలో ఉన్న 1,400కు పైగా దుకాణాలను ఏప్రిల్ 9 నుంచి వేలం వేస్తున్నారు. రోజువారీ అవసరాలను తీర్చడానికి, స్థానిక వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నివాస కాలనీలలో 60 నుండి 400 చదరపు అడుగుల పరిధిలో దుకాణాలను నిర్మించారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు.

మొదటి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది కాలనీలలోని 273 దుకాణాలకు ఏప్రిల్ 9, 10 తేదీలలో వేలం నిర్వహించనున్నారు. రెండో దశలో, హైదరాబాద్‌లోని 10 కాలనీలలోని 77 దుకాణాలను ఏప్రిల్ 15, 16 తేదీలలో వేలం వేయనున్నారు.

అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీలలో ఉన్న 892 దుకాణాలను ఏప్రిల్ 15, 17 తేదీలలో వేలం వేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఆరు కాలనీల...