భారతదేశం, జనవరి 31 -- సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.

డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన అనగనగా ఒక రాజు సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 30) సాయంత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య సినిమాల దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ వేడుకలో జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ కొల...