భారతదేశం, మే 14 -- భారతీయ వంటకాల్లో పసుపు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, రుచి, రంగు, ఆరోగ్యానికి కూడా ఇది ఒక ముఖ్యమైన పదార్థంగా చూస్తారు. ప్రతీ కూరలో పసుపు తప్పనిసరి. ఏదైనా దెబ్బతగిలినప్పుడు కూడా దాదాపు ప్రతి ఇంట్లో పసుపును ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాల కారణంగా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో లభించే పసుపు స్వచ్ఛమైనదేనని చెప్పలేం.

పెరుగుతున్న కల్తీ కారణంగా.. పసుపులో తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, రంగులను కలుపుతున్నారు. అందువల్ల ఇంట్లో దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

పసుపు రంగును, మృదువైన ఆకృతికి ఇవ్వడానికి మెటానిల్ యెల్లో, లెడ్ క్రోమేట్ వంటి కృత్రిమ రంగులు, రసాయనాలను తరచుగా కలుపుతారు. కొన్ని సందర్భాల్లో సుద్ద పొడి, అడవి పసుపు, లేదా నాణ్యత లేని ముడి పదార...