భారతదేశం, మే 21 -- ప్రతి నెలా శుక్లపక్షంలో వచ్చే షష్టిని స్కంద షష్టిగా జరుపుకుంటాము. మే నెలలో స్కంద షష్టి మే 21, అనగా ఈరోజు వచ్చింది. ఈ విశేషమైన పర్వదినాన వేకువజామునే నిద్రలేచి ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రత్యేకించి పూజించాలి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎలా పూజించాలో తెలుసుకోవడంతో పాటు పౌరాణిక గాధ కూడా తెలుసుకుందాం.

స్కంద షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని కూడా పిలుస్తారు. దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా ఈ వ్రతాన్ని జరుపుతారు. ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రతి నెలా శుక్ల పక్ష షష్టి నాడు స్కంద షష్టిని మనం జరుపుకుంటాము. షష్టి తిథి ఈరోజు ఉదయం 8:27 కి మొదలై రేపు ఉదయం 6:25 తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్టి వ్రతాన్ని మే 21, అనగ...