భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఉద్యోగంలో చేరినప్పటికీ సాంకేతిక, ఇతర కారణాల వల్ల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పరిధిలోకి రాని ఉద్యోగులకు కేంద్ర కార్మిక శాఖ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పీఎఫ్ అర్హత ఉండి కూడా ఖాతా తెరవని జీతభత్యాల ఉద్యోగుల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.

'ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ (ఈఈసీ) 2026' పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ 2026 అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసి, వారికి పీఎఫ్, పెన్షన్, బీమా (ఈడీఎల్ఐ) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొడిగించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

గత 17 ఏళ్ల వ్యవధిలో (2009 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు) అర్హత ఉండి పీ...