భారతదేశం, ఆగస్టు 1 -- ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా నూతన వ్యవస్థ పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది.

న్యూఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు.

"పాత క్లెయిమ్‌ల పెండింగ్ సమస్యనంతా దాదాపు పరిష్కరించాం. నూతన వ్యవస్థలో దాదాపు 90 శాతం క్లెయిమ్‌లు ఆటో-సెటిల్ అవుతున్నాయి. చందాదారులు దరఖాస్తు చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం" అని రమేష్ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

గతంలో కేవైసీ (KYC) వివరాలు పూర్తయిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేతిక...