భారతదేశం, డిసెంబర్ 17 -- ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,752 పంచాయతీలకు సర్పంచ్, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

ఈ మూడో విడత కింద 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోనూ 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 36,425 వార్డులకుగాను 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ ష...