Telangana, ఆగస్టు 6 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 3 విడతలు పూర్తి కాగా. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కూడా పూర్తి కావటంతో. ఇవాళ (ఆగస్ట్ 06) సీట్లను కేటాయించనున్నారు.

ఇంటర్ స్కోర్ తో పాటు వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 నుంచి ఆన్ లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు ఆగస్టు 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు 6 నుంచే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 8 తోనే ఈ సమయం కూడా ముగుస్తుంది.

అలాట్ మెంట్ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు...