భారతదేశం, మే 22 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో మామ చెప్పడంతో సాగర్ రామరాజును ఆస్తిలో వాటా అడుగుతాడు. రామరాజు చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటాడు. ఆస్తిలో పిల్లలకు కూడా హక్కు ఉంటుంది కదా. లేకుంటే కోర్టుకు వెళ్తామని సాగర్ మామ ప్రసాద్ రావు అంటాడు.

నీ అంతట నువ్వు పంచిస్తే నీకు గౌరవంగా ఉంటుంది. అదే కోర్టు ఆర్డర్ వేసినప్పుడు పంచితే నలుగురిలో స్వార్థపు తండ్రివి అన్న ముద్ర పడుతుందని ప్రసాద్ రావు అంటాడు. నీ బెదిరింపులకు ఈ రామరాజు బెదరడు. ఏం చేసుకుంటావో చేసుకో అని రామరాజు అంటాడు. మీరు ఆస్తి పంచకపోతే పోలీస్ స్టేషన్‌లా చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని లాయర్ అంటాడు. బయటకు వెళ్లమని రామరాజు అంటాడు.

ఈ పెద్దమనిషి వినడు కానీ కోర్టుకు వెళ్లి నోటీసులు పంపిద్దాం పదా అని సాగర్ అంటాడు. రేయ్ నడిపోడా ఏంట్రా....