భారతదేశం, ఏప్రిల్ 1 -- వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో జరిపిన దాడుల అనంతరం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారం పొడి ఉత్పత్తికి సంబంధించిన భారీస్థాయి కల్తీ దందాను ఆహార భద్రతా, పోలీసు అధికారులు వెలికితీశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీలలో వ్యాపారులు తమ అమ్మకాల పరిమాణాన్ని, లాభాలను పెంచుకోవడానికి నాసిరకం, పాడైన మిరపకాయలను, వాటి కాడలతో సహా నూరి నాసిరకం కారం పొడిని తయారు చేస్తున్నట్లు తేలింది.

హేమశ్రీ, లక్ష్మీ సాయి, అపర్ణ అనే పేర్లతో నడుస్తున్న యూనిట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. హేమశ్రీ యూనిట్‌లో అధికారులు 105 బస్తాల నాసిరకం మిరపకాయలను, 3,000 కిలోల శుద్ధి చేసిన పొడిని స్వాధీనం చేసుకోగా, లక్ష్మీ సాయి నుండి 70 బస్తాలను జప్తు చేశారు. కల్తీ పొడిని స్థానికంగా, పెద్ద కంపెనీలకు సరఫరా చేస్తున్నారని, ఆ కంపెనీలు దానిని తమ సొంత లేబు...