భారతదేశం, ఫిబ్రవరి 23 -- టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న అతిపెద్ద రూమర్.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల ప్రేమాయణం. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల నుంచి మొదలైన వీరి బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

అందుకు తగినట్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక పోస్టులు, ఫొటోలు ఉండేవి. ఇక కొన్ని రోజులుగా విజయ్, రష్మిక పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. కానీ, వివాహం గురించి ఇద్దరిలో ఎవరు రియాక్ట్ కాలేదు.

కానీ, తాజాగా ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి 10 గంటల సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించేశారు. విరోష్ అనే పేరుతో వెడ్డింగ్ పోస్టులను విజయ్ దేవరకొండతోపాటు రష్మిక మందన్నా ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దీంతో...