భారతదేశం, జూలై 31 -- రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల ఉద్యోగార్హతలు, నైపుణ్యాల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విద్యార్థుల సామర్థ్యాలను ఉద్దేశించి ఆయన ఉపయోగించిన 'క్రిమినల్ వేస్ట్' అనే పదంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. తెలంగాణలోని లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం దారుణంగా అవమానించారని అభిప్రాయపడుతున్నాయి.

"టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌" లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హతలపై కొన్ని కామెంట్స్ చేశారు. ...