భారతదేశం, జూలై 18 -- రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమయ్యే పనిలో పడింది. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు ఇలా ప్రతిదీ కల్తీ అవుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కల్తీలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఒక బలమైన, కఠినమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రతిపాదిత 'తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం' (TGFADCA) పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు మరియు పండ్లు త్వరగా మగ్గేలా చేసేందుకు విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారని, ఇది ప్రజల ప్రాణాల...