భారతదేశం, జూలై 6 -- బంగాళాదుంపలు తింటే బరువు పెరుగుతారు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అని చాలా కాలంగా ఒక అపోహ ఉంది. మనలో చాలా మంది ఆలుగడ్డలను పోషకాలు లేని ఆహారంగానే భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు.

"ఆలుగడ్డలను దశాబ్దాలుగా ఒక విలన్‌గా చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. తప్పు బంగాళాదుంపలది కాదు, దాని గురించి ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారానిదే" అని 'ది గట్ పర్స్పెక్టివ్' వ్యవస్థాపకురాలు, గట్ హెల్త్ (జీర్ణకోశ ఆరోగ్యం) నిపుణురాలు పరిధి గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు.

ఒక సర్వింగ్ ఆలుగడ్డలో 37 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి. దీనికి తోడు అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం, విటమిన్ సి, బి6, ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. కాబట్ట...