భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆన్‌లైన్ మార్కెట్​లో సంచలనం సృష్టించిన 'నథింగ్' బ్రాండ్, ఇప్పుడు భారత్‌లో నేరుగా కస్టమర్లకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఫిబ్రవరి 14, 2026న సంస్థ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను సంస్థ ప్రకటించింది.

స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, 'నథింగ్' ఒక పరిమిత కాల ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. సాధారణంగా రూ. 2,299 ధర ఉండే సీఎంఎఫ్​ బడ్స్​ 2 ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ. 99లకే సొంతం చేసుకోవచ్చు.

అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి:

ఈ ఆఫర్ స్టోర్ ప్రారంభించిన మొదటి 99 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సమయం ముగిసిన వెంటనే ఇయర్‌బడ్స్ ధర మళ్లీ యధావిధిగా రూ. 2,299 అవుతుంది.

మరోవైపు ఈ డీల్ కేవలం బెంగళూరులోని కొత్త స్టో...