భారతదేశం, జూలై 10 -- అక్టోబర్-నవంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో ఆధార్ ను పౌరసత్వ రుజువుగా ఎందుకు అంగీకరించడం లేదని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఒక దశలో బెంచ్ లోని ఒక న్యాయమూర్తి తాను కూడా ఈసీ నిర్దేశించిన పత్రాలన్నీ చూపించలేనని, ముఖ్యంగా ఇంత తక్కువ సమయంలో అది ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆధార్ ఆమోదయోగ్యమైన పత్రం అయినప్పటికీ, బీహార్ ఎస్ఐఆర్ కు చెల్లుబాటు అయ్యేలా ఎన్నికల సంఘం పరిగణించడం లేదని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆధార్ ను ఎందుకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా ఎందుకు పరిగణించరని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీని ప్రశ్నించింది. పౌరసత్వానికి ఆధార్ కార్డును ఉపయోగించలేమని ఈసీ తరఫు న్యాయవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.