ఆగస్టు 7 నుంచి శ్రీశైలం ఆలయంలో వరుణ యాగం.. ఈ తేదీల్లో పలు సేవలు రద్దు
భారతదేశం, ఆగస్టు 6 -- లోక కల్యాణం, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలనే సత్సంకల్పంతో శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల దేవస్థానంలో 'వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం' నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా అర్చకులు, వేద పండితులు పాంచాహ్నిక దీక్షతో వరుణయాగాన్ని ప్రారంభిస్తారు. లోకానికి నీటి కొరత లేకుండా చూడాలని కోరుతూ శ్రీ మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం (వేయి కలశాల జలంతో అభిషేకం) జరిపిస్తారు. అదేవిధంగా జగజ్జనని శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి విశేష అర్చనలు, రూపురేఖల పూజలు నిర్వహిస్తారు. ఈ ఐదు రోజుల పాటు క్షేత్రంలో రుద్ర హోమం, వరుణ సూక్త పారాయణాలు, వరుణ జపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.