భారతదేశం, ఆగస్టు 24 -- ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యాలకు ఈ ఏడాది వేదికవుతోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 28వ తేదీన ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం సంభవించనుంది. ఈసారి గ్రహణం కుంభ రాశిలో, అరుదైన శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుండటంతో జ్యోతిష్య పరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ సంప్రదాయంలో చంద్రుడిని మనస్సుకు, ఆలోచనలకు, భావోద్వేగాలకు అధిపతిగా భావిస్తారు. అందుకే చంద్రగ్రహణం సంభవించినప్పుడు దాని ప్రభావం మానసిక స్థితిపై, అలాగే వివిధ రాశుల వారి జీవితాలపై గట్టిగానే ఉంటుందని నమ్ముతారు.

ప్రత్యక్షంగా కుంభ రాశిలోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటంతో ఆ రాశివారిపై దీని ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మనసులో అనవసరమైన ఆందోళనలు, అశాంతి నెలకొనవచ్చు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. తొంద...