భారతదేశం, ఆగస్టు 15 -- జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనుషులు చేసే కర్మాచరణను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయాధిపతిగా, ధర్మకర్తగా శని గ్రహాన్ని భావిస్తారు. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా సంచరించే శని దేవుడు తన కదలికను లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మీన రాశిలో కొలువుదీరిన శని దేవుడు, త్వరలోనే తన నక్షత్ర స్థానాన్ని మార్చుకోబోతున్నాడు.

ప్రస్తుతం రేవతి నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్న శని, తిరోగమన స్థితిలో ఉండటం వల్ల వెనుకకు పయనిస్తూ రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు 20, 2026 నాడు రాత్రి 7:45 గంటలకు శని దేవుని ఈ నక్షత్ర పద మార్పు జరగనుంది. ఈ మార్పు వల్ల ఆగస్టు 20 నుంచి నాలుగు రాశుల వారి జీవితాల్లో క...