భారతదేశం, జూన్ 7 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు గతంలో నిర్వహించిన ఒక పరీక్షను రద్దు చేసి, దాని స్థానంలో తిరిగి సరికొత్తగా పరీక్షను నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఆ వివరాలు ఏంటో చూడండి.

ఏయూ పరిధిలోని 2020-21 విద్యా సంవత్సరం B.Sc నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ విద్యార్థులకు పార్ట్-II కెమిస్ట్రీ పేపర్-V (ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ) పరీక్షను తిరిగి నిర్వహించబోతున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ రీ-ఎగ్జామ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షల విభాగం) ఎం. పద్మరాజు ఈ పరీక్షల పునఃనిర్వహణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రద్దయిన ఈ కెమి...