భారతదేశం, ఆగస్టు 12 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సరిహద్దుల మార్పులు, కొన్ని జిల్లాల పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్న మంత్రుల బృందం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న మూడు మండలాలైన మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి పరిధిలోని 29 రెవెన్యూ గ్రామాలు అమరావతిలో ఉన్నాయి. రాజధానిగా అభివృద్ధి చెందుతున్నందున, పాలనాపరమైన సౌలభ్యం కోసం అమరావతిని ప్రత్యేక జిల్లాగా చేయాలని మంత్రుల బృందం భావిస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కొత్త జిల్లా అమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.