భారతదేశం, మే 19 -- ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సాగు సంక్షోభం తలెత్తకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగింది.

ఖరీఫ్-2026 సాగు సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలో ఉన్నతాధికారులు, జిల్లాల జేడీఏలు, వ్యవసాయ అధికారులతో (DAOs) సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతులకు సకాలంలో సేవలు అందించడమే కాకుండా, నకిలీలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేసేలా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

యూరియా కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇకపై ప్రత్యేక కార్డుల ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ చేయనున్నారు. దీనివల్ల రైతులకు వారి...