భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆర్టీసీ ఆధునికీకరణ లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 750 ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి విడతగా 350 ఈ-బస్సులను ఈ ఏడాది అక్టోబరు నాటికి రోడ్డెక్కించేందుకు ఏపీఎస్ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన బస్సులను డిసెంబరు ఆఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్దపీటప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ-బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. భవిష్యత్తులో డిపోల వారీగా పాత డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహిత ...