భారతదేశం, ఆగస్టు 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్య డైరెక్టరేట్ శ్రీకారం చుట్టింది.

మొత్తంగా 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల నియామకం చేపడుతున్నట్లు అధికారుల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన చేపడుతున్నారు. మొత్తం 6,534 ఖాళీలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. స్కూల్ అసిస్టెంట్ 2,937, సెకండరీ గ్రేడ్ టీచర్ 3,597 ఖాళీలు ఉన్నాయి.

ఈ నియామకం కేవలం 8 నెలల కాలానికి మాత్రమే పరిమితం. 2026 సెప్టెంబర్ 01 నుండి 2027 ఏప్రిల్ 30 వర...