భారతదేశం, జూన్ 23 -- వికలాంగులు, బాధితులకు బాసటగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను (ఆర్టిఫిషియల్ ఆర్గాన్ మేకింగ్ యూనిట్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్లు, శ్రవణ పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్) వంటి సహాయక పరికరాలను నేరుగా అందిస్తారు.

రాష్ట్రంలో ఇలాంటి ప్రత్యేక విభాగాలను తీసుకురావడం ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల సూచనల మేరకు. వికలాంగులకు నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులను ఉచితంగా అందించడం ద్వారా వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మొద...