భారతదేశం, జూన్ 11 -- రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు.

'విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులను వేగవంతం చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా దానిని పునరుద్ధరించేలా చూడాలి. అలాగే విద్యుత్ వ్యవస్థ విశ్వసనీయతను బలోపేతం చేయాలి.' అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు....