భారతదేశం, మే 14 -- పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ఏపీ ప్రభుత్వం చర్చించింది. దేశం కోసం పొదుపు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పొదుపు, బాధ్యతాయుతమైన ఖర్చు, సుస్థిర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను అలవర్చుకోవడానికి, అనవసర ఖర్చులను నివారించడానికి ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం త్వరలో 'నా దేశం - నా బాధ్యత' అనే ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

కేవలం సంకేతాత్మక చర్యలు సహాయపడవని స్పష్టం చేస్తూ, మంత్రులు, వీఐపీల భద్రతా కాన్వాయ్‌లను తగ్గించడం ఒక ఆరంభం మాత్రమేనని నాయుడు తెలిపరు. 'ప్రజాధనాన్ని ఆదా చేయగల అనేక ఇ...