భారతదేశం, జూన్ 25 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, ఖనిజ సంపదను వెలికితీసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని గోల్డ్ మైనింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనాథం బంగారు బ్లాక్ (Chigurgunta-Bisanatham Gold Block)ను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

చిత్తూరు జిల్లా పరిధిలోని ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత కీలకమైన బంగారు నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రసిద్ధ కోలార్ స్కిస్ట్ బెల్ట్ పొడిగింపులోనే ఈ చిగురుకుంట-బిసనాథం బ్లాక్ ఉంది. ఇక్కడి గనుల్లో లభ్యమయ్యే బంగారం అత్యంత నాణ్యమైనదిగానిపుణులు తేల్చారు.

గతంలో ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు సాగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ...