భారతదేశం, ఆగస్టు 2 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ గ్రూప్ గ్లోబల్ లిమిటెడ్, ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్(DIMPLE) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విజయవాడలోని పటమట జీడీఈటీ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. విద్యా రంగంలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిని ఒకే గొడుగు కిందకు తెచ్చి మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖను ఏర్పాటు చేశామని, దీనివల్ల విద్యా రంగంలో సమన్వయంతో కూడిన మార్పులు సాధ్యమవుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో డిజిటల్ ఏకీకరణ, ఉపాధ్యాయుల నియామకం, వ...