భారతదేశం, ఆగస్టు 10 -- ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మొదట స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ 22ఏ బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ భూ, రెవెన్యూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మాజీ సైనికులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తమకు ప్రభుత్వం అందించిన భూములు 22ఏ జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను విన్న సీఎం చంద్రబాబు.. సంబంధిత భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదే విధంగా డీ నోటిఫికేషన్‌ ప్రక్రియను సులభతరం చేసేలా ఆర్డీఓకు అధికారాలను కల్పించాలని సూచించారు.

అలాగే అస...